అన్‌లాక్‌ అయినా.. అంతర్ రాష్ట్ర సర్వీసులకు నో పర్మిషన్

by  |
TS RTC Bus
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ నేటి నుంచి పూర్తిగా అన్ లాక్ కానుంది. రాష్ట్రంలోని అన్ని వ్యాపార, వాణిజ్య రంగాలు తెరుచుకోనున్నాయి. ప్రజా రవాణ సైతం పరుగులు పెట్టనుంది. లాక్‌డౌన్‌కు ముందు ఆర్టీసీ 9 వేల బస్సులను నడిపింది. వీటిల్లో వెయ్యి బస్సులను అంతర్ రాష్ట్ర సర్వీసులకు కేటాయించింది. అయితే నేటి నుంచి 8 వేల బస్సులు యథావిధిగా రోడ్డెక్కినా.. అంతర్ రాష్ట్ర సర్వీసులు మాత్రం ఆగిపోనున్నాయి.

తెలంగాణ నుంచి అంతర్ రాష్ట్ర సర్వీసులు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకే టీఎస్ ఆర్టీసీ సర్వీసులను నడుపుతోంది. అయితే ఆ రాష్ట్రాల్లో కరోనా కేసులు ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో అంతర్ రాష్ట్ర సర్వీసులపై ఆ ప్రభావం పడుతోంది. ఆయా స్టేట్‌లలో కేసులు తగ్గిన తర్వాతే ఈ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దీనిపై టీఎస్ ఆర్టీసీ ఈడీ యాదగిరి కూడా క్లారిటీ ఇచ్చారు.

Next Story

Most Viewed