- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హుజూరాబాద్ : ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్య జరగనున్న కురుక్షేత్ర యుద్ధంలో ధర్మమే విజయం సాధిస్తుందని మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం పట్టణంలోని పలు వార్డులలో ఈటల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బానిసత్వంలో మగ్గిపోదామా.. తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగురవేద్దామా తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్తో కొట్లాటకు దిగిన తనకు అండగా ఉండాలని ప్రజలను అభ్యర్థించారు. అహంకారంతో రుద్దబడ్డ ఈ ఎన్నికల్లో ప్రజలే న్యాయ నిర్ణేతలని అభివర్ణించారు. ఓట్ల కోసం ఎన్ని పథకాలు ప్రవేశ పెట్టినా.. సర్వేలు టీఆర్ఎస్కు అనుకూలంగా లేవని, చైతన్యవంతులైన హుజూరాబాద్ నియోజకవర్గ ఓటర్లు ఉప ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్కు కర్రు కాల్చి వాత పెట్టాలని రాజేందర్ పిలుపునిచ్చారు.
Next Story