‘ఆయుష్మాన్‌ భారత్‌ కంటే ఆరోగ్య శ్రీ గొప్ప’

by  |
‘ఆయుష్మాన్‌ భారత్‌ కంటే ఆరోగ్య శ్రీ గొప్ప’
X

ఆయుష్మాన్‌ భారత్‌ కంటే ఆరోగ్య శ్రీ గొప్పగా సేవలు అందిస్తుందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో జరిగిన తెలంగాణ కార్డియాలజీ సొసైటీ 5వ వార్షిక సమావేశంలో గవర్నర్ తమిళి సై, ఈటల రాజేందర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. జబ్బు వచ్చాక నయం చేయడం కంటే.. రాక ముందే నివారణ చర్యలను కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. వ్యాధులను ముందుగానే గుర్తించే లాగా ప్రజలలో అవగాహన కల్పించి.. వారిని ముందుకు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్తులో వైద్య ఖర్చులు తగ్గించడం కోసం పరిశోధనలు జరగాలని ఈటల సూచించారు.



Next Story