హుజురాబాద్ విజయంపై ఈటల షాకింగ్ కామెంట్స్..

by  |
హుజురాబాద్ విజయంపై ఈటల షాకింగ్ కామెంట్స్..
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఎన్ని కుట్రలు చేసైనా సరే ఈటల రాజేందర్‌ను ఓడించాలని సీఎం కేసీఆర్ అనుకున్నారని, కానీ ఫేక్ లెటర్లు, వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు తనకు ఘన విజయాన్ని అందించారన్నారు. ఈటల రాజేందర్ బుధవారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. ఇది సీఎం కేసీఆర్‌ అహంకారంపై తెలంగాణ ప్రజలు సాధించిన విజయమన్నారు. హుజురాబాద్ ప్రజలు తమ గుండెను చించి ఆత్మను ఆవిష్కరించి గొప్ప మెజారిటీ అందించారని పేర్కొన్నారు. ఏడో సారి ఎమ్మెల్యేగా తనను గెలిచిపించారని.. ఏం చేసినా హుజూరాబాద్‌ ప్రజల రుణం తీర్చుకోలేనన్నారు. గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.


Next Story