హుజురాబాద్‌కు ఈటల రాజేందర్.. గ్రాండ్ వెల్‌కమ్!

by  |
etala-huzurabad 1
X

దిశ, హుజురాబాద్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత మొదటిసారిగా హుజురాబాద్‌కు రావడంతో అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. హుజురాబాద్ మండలంలోని కాట్రపల్లి గ్రామంలో ఘనస్వాగతం పలికారు.

అనంతరం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత స్థానిక అంబేద్కర్ విగ్రహానికి ఈటల పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ చౌరస్తాలో సుమారు ఐదు వేల పైచిలుకు అభిమానులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు తరలివచ్చారు. దీంతో హుజురాబాద్ పట్టణం జనంతో కిక్కిరిసిపోయింది.

Next Story

Most Viewed