ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్..

by  |
ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్..
X

దిశ, ఏపీ బ్యూరో: విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జగనన్న విద్యా కానుక పథకంలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఇంగ్లీష్‌–తెలుగు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలను అందించాలని నిర్ణయించింది. ఈ డిక్షనరీల కొనుగోలుకు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ జీవో–36 విడుదల చేశారు. ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులు కూడా రాణించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. జగనన్న విద్యా కానుక పథకం ద్వారా ఇప్పటికే విద్యార్థులకు మూడు జతల యూనిఫారం, పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, ఒక జత షూలు, రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగును అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది వీటికి తోడు అత్యున్నత ప్రమాణాలతో కూడిన డిక్షనరీలను కూడా అందించాలని నిర్ణయించింది. తొలుత 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లిష్‌–తెలుగు డిక్షనరీలను అందించాలని ఇందుకోసం నియమించిన కమిటీ గుర్తించింది. దీంతో 6–10వ తరగతి విద్యార్థుల కోసం 23,59,504 ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

Next Story