టీ20 వరల్డ్ కప్: సెంచరీతో చెలరేగిన జోస్ బట్లర్.. శ్రీలంక టార్గెట్..?

by  |
టీ20 వరల్డ్ కప్: సెంచరీతో చెలరేగిన జోస్ బట్లర్.. శ్రీలంక టార్గెట్..?
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా షార్జా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న శ్రీలంక వర్సెస్ ఇంగ్లాండ్‌ మ్యాచ్‌లో జోస్ బట్లర్ సెంచరీతో చెలరేగాడు. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక… జోస్ బట్లర్ మినహా ఇంగ్లాండ్‌ బ్యాటర్లను కట్టడి చేసింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది ఇంగ్లాండ్. జాసన్ రాయ్ (9), మలన్ (6), బెయిర్ స్టో (0) డకౌట్‌తో వెనుదిరిగారు. కానీ, ఓపెనర్‌గా బరిలోకి దిగిన జోస్ బట్లర్ ఆది నుంచి అదరగొట్టాడు. 67 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇతడికి తోడు ఇయాన్ మోర్గాన్ (40) పరుగులతో పెవిలియన్ చేరాడు. మొయిన్ అలీ (1 నాటౌట్)గా నిలిచే సరికి నిర్ణీత ఓవర్లు ముగిశాయి. దీంతో ఇంగ్లాండ్ 163 పరుగులు చేయగలిగింది.

https://twitter.com/StarSportsIndia/status/1455201446614298628?s=20

Next Story

Most Viewed