రెచ్చిపోయిన కబ్జాదారులు.. ఎందుకంటే.

by  |
రెచ్చిపోయిన కబ్జాదారులు.. ఎందుకంటే.
X

దిశ వెబ్ డెస్క్:
ప్రభుత్వ భూమిని ప్లే గ్రౌండ్ కు వినియోగించాలన్నందుకు ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి, అతని కుటుంబంపై భూ కబ్జాదారులు దాడి చేశారు. ఈ ఘటన నిజామాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే…జిల్లాలోని బాల్కొండ నియోజక వర్గంలోని ఏర్గట్ల మండల కేంద్రంలో కొంత ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది. దాన్ని స్కూల్ పిల్లల ప్లే గ్రౌండ్ కోసం వినియోగించాలని అధికారులను హరిప్రసాద్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి కోరారు. దాని కోసం ఆ భూమి వివరాలు అధికారులను ఆయన అడిగారు. దీంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగిపై భూ కబ్జాదారులు కక్ష కట్టారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కబ్జాదారులు దాడికి దిగారు. కాగా పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.



Next Story