మ‌ణుగూరులో ఎదురుకాల్పులు

by  |
మ‌ణుగూరులో ఎదురుకాల్పులు
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మల్లెపల్లితోగు అటవీప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య బుధ‌వారం ఉద‌యం 9 గంట‌ల‌కు ఎదురుకాల్పులు జరిగిన‌ట్లు ఎస్పీ సునీల్‌ద‌త్ తెలిపారు. మావోల‌కు సంబంధించిన సామ‌గ్రిని కూంబింగ్ బృందాలు స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. పారిపోయిన మావోయిస్టుల కోసం ముమ్మరంగా కొనసాగుతున్న గాలింపు చర్యలు చేప‌డుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోకి మావోయిస్టులు ప్రవేశించారనే విశ్వసనీయ సమాచారం మేరకు గ‌త కొద్ది రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు అటవీ ప్రాంతంలో 500 మంది పోలీసులు 25 బృందాలుగా ఏర్పడి కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.



Next Story

Most Viewed