- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ , ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం-ఆళ్లపల్లి మండలాల్లోని అటవీ ప్రాంతంలో బుధవారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య రెండు సార్లు ఎదురు కాల్పులు జరిగాయి. మొదటిసారి కాల్పుల నుంచి తప్పించుకున్న నక్సల్స్ను పోలీసు బృందాలు వెతుక్కుంటూ వెళ్లాయి. సరిగ్గా అదే సమయంలో మావోలు పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. వివరాల్లోకివెళితే.. బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మణుగూరు మల్లెపల్లి తోగు అటవీప్రాంతంలో మావోలకు, పోలీసులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. మావోల సంచారాన్ని గుర్తించిన పోలీసులు ముందుగా వారిపై కాల్పులు జరిపారు. అయితే, చాకచక్యంగా తప్పించుకున్న మావోలు కరకగూడెం-ఆళ్లపల్లి మండలాల మధ్య ఉన్న అటవీ ప్రాంతలో వారు తలదాచుకున్నారు. ఈ సమాచారంతో మళ్లీ బలగాలు రంగంలోకి దిగాయి. ఈక్రమంలోనే కూంబింగ్ నిర్వహిస్తున్న గ్రేహౌండ్స్ పోలీసుల పై మావోలు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కానిస్టేబుల్ మోచేతికి గాయం కాగా.. మావోల వైపు ప్రాణనష్టం జరిగినట్లుగా పోలీస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే దీనిపై ఉన్నతాధికారులు అధికారిక ప్రకటన చేయలేదు. తుపాకుల మోతతో అటవీపై ఆధారపడి బతుకుతున్న ఆదివాసీ, గిరిజన ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.