భ‌ద్రాద్రి అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్

by  |
భ‌ద్రాద్రి అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్
X

దిశ , ఖ‌మ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం-ఆళ్లపల్లి మండలాల్లోని అటవీ ప్రాంతంలో బుధ‌వారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య రెండు సార్లు ఎదురు కాల్పులు జరిగాయి. మొదటిసారి కాల్పుల నుంచి తప్పించుకున్న నక్సల్స్‌ను పోలీసు బృందాలు వెతుక్కుంటూ వెళ్లాయి. సరిగ్గా అదే సమయంలో మావోలు పోలీసులపై కాల్పులు జ‌రిపారు. ఈ ఎదురు కాల్పుల్లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. వివరాల్లోకివెళితే.. బుధ‌వారం ఉద‌యం 9 గంట‌ల‌ ప్రాంతంలో మణుగూరు మల్లెపల్లి తోగు అటవీప్రాంతంలో మావోలకు, పోలీసులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. మావోల సంచారాన్ని గుర్తించిన పోలీసులు ముందుగా వారిపై కాల్పులు జరిపారు. అయితే, చాకచక్యంగా తప్పించుకున్న మావోలు క‌ర‌క‌గూడెం-ఆళ్లప‌ల్లి మండ‌లాల మ‌ధ్య ఉన్న అట‌వీ ప్రాంతలో వారు తలదాచుకున్నారు. ఈ సమాచారంతో మళ్లీ బ‌లగాలు రంగంలోకి దిగాయి. ఈక్ర‌మంలోనే కూంబింగ్ నిర్వ‌హిస్తున్న గ్రేహౌండ్స్ పోలీసుల పై మావోలు ఎదురు కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో కానిస్టేబుల్ మోచేతికి గాయం కాగా.. మావోల వైపు ప్రాణన‌ష్టం జ‌రిగిన‌ట్లుగా పోలీస్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. అయితే దీనిపై ఉన్నతాధికారులు అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. తుపాకుల మోత‌తో అట‌వీపై ఆధారపడి బ‌తుకుతున్న ఆదివాసీ, గిరిజ‌న ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.


Next Story

Most Viewed