రాంబాగ్‌లో ఎదురుకాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

by  |
రాంబాగ్‌లో ఎదురుకాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకాశ్మీర్ శ్రీనగర్‌లోని రాంబాగ్ ప్రాంతంలో సోమవారం ఉదయం పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. రాంబాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేరకు సీఆర్‌పీఎఫ్ జవాన్లు గాలింపు చేపట్టారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరపారు. దీంతో పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ విదేశీ ఉగ్రవాది, మరో స్థానిక ఉగ్రవాది హతమయ్యారు.


Next Story

Most Viewed