దద్దరిల్లిన దండకారణ్యం.. ఏరులై పారిన రక్తం..!

by  |
దద్దరిల్లిన దండకారణ్యం.. ఏరులై పారిన రక్తం..!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దండకారణ్య అటవీ ప్రాంతంలో కాల్పులతో దద్దరిల్లింది. శనివారం ఉదయం నుండి కాల్పుల మోత మోగుతూనే ఉంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా కీకారణ్యంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసు బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. వెంటనే అప్రమత్తమైన ఇరువురు కాల్పులు ప్రారంభించారు. ఉదయం ప్రారంభం అయిన కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు సమాచారం. ఈ ఎదురుకాల్పుల్లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, సీఆర్పీఎఫ్‌లకు చెందిన ఐదుగురు పోలీసులు చనిపోయినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా, మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు కూడా మరణించినట్టు సమాచారం. కానీ, అధికారికంగా పోలీసులు ధృవీకరించ లేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed