చంచల్‌గూడలో ఉద్యోగులు ధర్నా

by  |

దిశ ప్రతినిధి, హైదరాబాద్: కరోనా కట్టడి చర్యలను కఠినంగా అమలు చేడయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ చంచల్ గూడ ప్రభుత్వ ముద్రణాలయo ఉద్యోగులు శుక్రవారం కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. గత నాలుగు రోజులుగా 8 మంది ఉద్యోగులు కరోనా బారిన పడినప్పటికీ అధికారులు ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోవడం లేదని పలువురు యూనియన్ నేతలు ఆరోపించారు. ఉద్యోగుల హాజరు నియమాన్ని పాటించకుండా అధికారులు కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని ఆగ్రహం వారు వ్యక్తం చేశారు. అధికారులు చర్యలు చేపట్టకపోతే పెద్ద ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.



Next Story