వైశ్య లైమ్ లైట్ అవార్డులను ప్రదానం చేయనున్న ఎమ్మెల్సీ కవిత

by  |
mlc kavitha copy
X

దిశ, శేరిలింగంపల్లి: ఆయా రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వైశ్య కమ్యూనిటిలోని మహిళలకు ఈనెల 24న నగరంలోని జెఆర్‌సి కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ప్రత్యేక వార్షిక కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత వైశ్య లైమ్‌లైట్ అవార్డులను ప్రదానం చేయనున్నారు. వైశ్య కమ్యూనిటీలో మహిళలు సాధించిన విజయాలను గుర్తించి, అవార్డులను ఏర్పాటు చేసిన వైశ్య లైమ్‌ లైట్‌కు చెందిన శివ కుమార్ ఎమ్మాడి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

వైశ్య వనితలను వారి వారి వృత్తిలో, పారిశ్రామిక రంగంలో, బిజినెస్‌లో, నూతన సంస్థలను స్థాపించి వ్యాపార కలాపాలను నిర్వహించడంలో ప్రోత్సహించడం కోసం ఈ అవార్డులను ప్రవేశపెట్టినట్లు, ఇవి ప్రతియేటా ప్రదానం చేయడం జరుగుతుందని శివ కుమార్ తెలిపారు.వైశ్య కమ్యూనిటీలో కొన్ని రంగాల్లో ప్రప్రథమంగా ప్రవేశించి, ట్రయల్ బ్లేజర్స్ గా నిలిచిన 16 మంది మహిళా సాధకులను ఎమ్మెల్సీ కవిత సముచితంగా సత్కరిస్తారని, వీరితో పాటు ముగ్గురు మహిళలను కూడా ఎక్సలెన్స్ అవార్డులతో సత్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ బిగాలతో పాటు పలువురు వైశ్య ప్రముఖులు అవార్డు ప్రదానం‌లో పాల్గొననున్నారు.



Next Story

Most Viewed