ఇక్కడ కూడా.. 37 మంది అభ్యర్థుల ఎలిమేషన్​

by  |
ఇక్కడ కూడా.. 37 మంది అభ్యర్థుల ఎలిమేషన్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్​ – రంగారెడ్డి – మహబూబ్​ నగర్​ ఎమ్మెల్సీ స్థానంలో అభ్యర్థుల ఎలిమినేషన్​ కొనసాగుతోంది. అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థుల్లో ఇప్పటివరకు 37 మందిని ఎలిమినేట్​ చేశారు. వీరందరికి కలిపి 1,217 ఓట్లు రాగా.. వాటిలో రెండో ప్రాధాన్యత ఇచ్చిన అభ్యర్థులకు కేటాయించారు. ఎలిమినేషన్​ అయిన అభ్యర్థుల ఓట్ల నుంచి టీఆర్​ఎస్​కు 140, బీజేపీకి 128, కాంగ్రెస్​కు 69, ప్రొఫెసర్​ నాగేశ్వర్​కు 85 ఓట్లు వచ్చాయి. రెండో ప్రాధాన్యత ఓట్లు చేర్చిన తర్వాత కూడా టీఆర్​ఎస్​ అభ్యర్థి వాణిదేవి సమీప బీజేపీ అభ్యర్థి రాంచందర్​ రావుపై 8,033 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు.

అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లు (రెండో ప్రాధాన్యత ఓట్లతో కలిపి)
బీజేపీ–1,04,796
టీఆర్ఎస్​–1,12,829
నాగేశ్వర్​ –53,695
కాంగ్రెస్​– 31,623



Next Story

Most Viewed