జిల్లాకు ఎన్నికల సాధారణ పరిశీలకులు రాక

by  |
జిల్లాకు ఎన్నికల సాధారణ పరిశీలకులు రాక
X

దిశ, సిద్దిపేట : దుబ్బాక ఉపఎన్నికలు నిష్పక్షపాతంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం జిల్లాకు ఎన్నికల సాధారణ పరిశీలకులుగా రాఘవశర్మను నియమించినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంకట్రామ రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లాకు రాఘవ శర్మ వచ్చినట్లు కలెక్టర్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల జారీ చేశారు.

పోలింగ్ ముగిసే వరకు సిద్దిపేట విద్యుత్ గెస్ట్‎హౌస్‎లో ఎన్నికల సాధారణ పరిశీలకులు రాఘవ శర్మ అందుబాటులో ఉంటారని కలెక్టర్ తెలిపారు. ముందస్తు అపాయింట్‎మెంట్‎తో రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు దుబ్బాక ఎన్నికలకు సంబంధించిన అంశాలపై రాఘవ శర్మను కలవవచ్చని సూచించారు. నేరుగా వచ్చి కలవలేని వారు రాఘవ శర్మను 9816818005 నెంబర్ లో సంప్రదించవచ్చునని తెలిపారు. దుబ్బాక ఎన్నికలకు సంబంధించి ఏమైనా ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన లు, ఫిర్యాదులుంటే సాధారణ పరిశీలకులకు తెలియజేయాలని కలెక్టర్ వెంకట్రామ రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.


Next Story

Most Viewed