రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ భేటీ

by  |
రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ భేటీ
X

దిశ, వెబ్‎డెస్క్: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను తిరిగి నిర్వహించే అంశంపై చర్చించేందుకు ఈ నెల 28న వివిధ రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ భేటీ కానుంది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు గతంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్‎లాక్ ప్రకటించడంతో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల నిర్ణయం కోసం ఎస్ఈసీ మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.


Next Story

Most Viewed