వారిని ఎలక్షన్ డ్యూటీకి ఎంపిక చేయవద్దు: సీఈసీ

by  |
వారిని ఎలక్షన్ డ్యూటీకి ఎంపిక చేయవద్దు: సీఈసీ
X

న్యూఢిల్లీ: ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించినట్టు అభియోగాలున్న, క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొన్న అధికారులను మళ్లీ ఎలక్షన్ డ్యూటీకి ఎంపిక చేసుకోవద్దని త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. మరో ఆరు నెలల్లో రిటైర్ అయ్యే అధికారులనూ ఈ విధులకు తీసుకోవద్దని అసోం, కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి ప్రధాన కార్యదర్శులకు సూచించింది. ఈ రాష్ట్రాల అసెంబ్లీ గడువు మే, జూన్‌ నెలల్లో పూర్తికానున్నందున ఏప్రిల్ లేదా మే నెలల్లో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి.

Next Story