కేసీఆర్ ఓ జిమ్మిక్కుల ముఖ్యమంత్రి: బండి

by  |
కేసీఆర్ ఓ జిమ్మిక్కుల ముఖ్యమంత్రి: బండి
X

దిశ, వెబ్ డెస్క్: కేసీఆర్ ఓ జిమ్మిక్కుల ముఖ్య మంత్రి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ముందస్తు పథకం ప్రకారమే గ్రేటర్ ఎన్నికలను హడావుడిగా నిర్వహించారని చెప్పారు. వరద సాయం పేరుతో ఎన్నికల్లో లబ్ది పొందాలని కేసీఆర్ అనుకున్నారని తెలిపారు. ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. టీఆర్ఎస్ చెప్పు చేతల్లో ఎన్నికల కమిషన్ నడిచిందని ఆరోపించారు. అభ్యర్థులను ఖరారు చేసేందుకు కూడా సమయం ఇవ్వలేదని పేర్కొన్నారు. ఎలాగైనా గెలవాలని అడ్డదారులు తొక్కారని చెప్పారు. అయినా గ్రేటర్ ప్రజలు బీజేపీకి అండగా నిలిచారని తెలిపారు. బీజేపీ కార్యకర్తలంతా కలసి కట్టుగా శ్రమించారని పేర్కొన్నారు. దుబ్బాక ఫలితం తర్వాత కేసీఆర్‌కు భయం పట్టుకుందని చెప్పారు.


Next Story

Most Viewed