రసవత్తరంగా బీహార్ ఎన్నికల ప్రచారం

by  |
రసవత్తరంగా బీహార్ ఎన్నికల ప్రచారం
X

దిశ, వెబ్‌డెస్క్: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. జేడీయూ- బీజేపీ, ఆర్జేడీ కూటమి నేతలు ఘాటైన వ్యాఖ్యలతో విమర్శలు చేసుకుంటున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బీహార్‌లో ప్రచారం చేస్తూ ఆర్జేడీ కూటమిపై విరుచుకు పడగా అదే స్థాయిలో ఆర్జేడీ స్టార్ క్యాంపెయినర్ తేజస్వీ యాదవ్ తిప్పికొడుతున్నారు. బీహార్ ఎన్నికల్లో చెప్పుకోవడానికి బీజేపీకి ఒక నేత లేరని తేజస్వీయాదవ్ దుయ్యబట్టారు. విజన్ డాక్యుమెంట్స్‌ను విడుదల చేయడానికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ రావల్సి వచ్చిందన్నారు. నితీశ్ కుమార్ 15ఏళ్లు పాలించినప్పటికీ బడ్జెట్ నిబంధనల గురించి తెలియదని మండిపడ్డారు.

Next Story

Most Viewed