ఎమ్మెల్యే ఈటలకు బీజేపీ నాయకులు ఘన స్వాగతం

by  |
ఎమ్మెల్యే ఈటలకు బీజేపీ నాయకులు ఘన స్వాగతం
X

దిశ, చిట్యాల: బీజేపీ నాయకుడు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆదివారం ఖమ్మం, నల్లగొ జిల్లాలో పర్యటించునున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు కూరేళ్ల శ్రీను ఆధ్వర్యంలో స్థానిక బీజేపీ నాయకులు ఈటలకు ఘనంగా స్వాగతం పలికారు. దీంతో ఈటల పట్టణంలోని అంబెడ్కర్ చౌక్ వద్ద గల మహాత్మ జ్యోతిరావు పూలే, డా. బీఆర్ అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలతో కలిసి ఫోటోలు దిగారు. ఆయనకు స్వాగతం పలికిన వారిలో స్థానిక బీజేపీ నాయకులు మాస శ్రీనివాస్, కూరేళ్ల శ్రీను, చికిలమ్మేట్ల అశోక్,పల్లె వెంకన్న, గంజి గోవర్ధన్ , జిట్ట కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed