ఫిబ్రవరి ఒకటి నుంచి విద్యా సంస్థలు ప్రారంభం

by  |
ఫిబ్రవరి ఒకటి నుంచి విద్యా సంస్థలు ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా, లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన స్కూళ్లను తిరిగి ప్రారంభించేందుకు ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా ఫిబ్రవరి ఒకటి నుంచి తెలంగాణలోని స్కూళ్లను ప్రారంభించేందుకు తగు ప్రణాళికలను రూపొందిస్తుంది. ఇందులో భాగంగానే 9వ తరగతి నుంచి ఆ పై క్లాసులను ప్రారంభించేందుకు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాగా, ఇటీవల జనవరి 18 నుంచి ఇంటర్, డిగ్రీ కాలేజీలు తెరిచేందుకు విద్యా శాఖ ప్రతిపాదనలు పంపిణీ సంగతి తెలిసిందే. దీంతో విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Next Story

Most Viewed