వెస్లీ విద్యా సంస్థల్లో విలువలతో కూడిన విద్య : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

by  |
వెస్లీ విద్యా సంస్థల్లో విలువలతో కూడిన విద్య : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
X

దిశ, బేగంపేట: వెస్లీ విద్యా సంస్థలు విలువలతో కూడిన విద్యను అందించడంతో పాటు సమాజానికి ఉత్తమ పౌరులను అందించేందుకు పాటుపడుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్లీ బాయ్స్ జూనియర్ కాలేజ్ స్వర్ణోత్సవాలు మంగళవారం కళాశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తలసాని, నాడు విద్యా సంస్థలు కేవలం విద్యతో సమాజంలో మార్పు కోసం పాటుపడేవని కానీ నేడు మాత్రం కేవలం వ్యాపారమే ధ్యేయంగా చాలా సంస్థలు నడుస్తున్నాయని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు.

వెస్లీ కళాశాలలో అటు విద్యతో పాటు క్రీడలను కూడా ఎంతో ప్రోత్సహించే వారని అందువల్ల ఎంతో మంది అంతర్జాతీయ క్రికెటర్లు ఇక్కడి నుంచే వచ్చారని గుర్తు చేశారు. ఇలాంటి విద్యా సంస్థ స్వర్ణోత్సవాలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు . తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఎన్నడూలేని విధంగా అనేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారని అన్నారు . ఒక విద్యార్థికి మంచి విద్యను అందిస్తే తన కుటుంబాన్నే కాకుండా తన విజ్ఞానంతో సమాజాన్ని కూడా ముందుకు నడిపిస్తారని ఆయన అన్నారు . ఎంతో ప్రాముఖ్యత ఉన్న వెస్లీ కళాశాలకు భవిష్యత్లో ఎలాంటి అవసరం ఉన్నా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు . ఈ సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల పోస్టల్ స్టాంపును విడుదల చేశారు . ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ మోజస్ పాల్ , సీఎస్ఐ మెదక్ డయాసిస్ వైస్ చైర్మన్ రెవరెండ్ భాస్కర్ , డిగ్రీ , పీజీ | కళాశాలల డైరెక్టర్ విమల్ సుకుమార్ , డయాసిస్ ప్రతినిధులు చార్లెస్ వెస్లీ , సత్యానందం , ఎం డేవిడ్ , డేనియల్ , రెవరెండ్ ప్రసన్నకుమార్ , ప్రేమ్ సుకుమార్ పూర్వ విద్యార్థులు అల్లాడి రవి తదితరులు పాల్గొన్నారు .

అమీర్ పేట జీహెచ్ఎంసీ గ్రౌండ్ లో తలసాని…

అనంతరం విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా దోహదపడతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం అమీర్ పేట లోని జీహెచ్ఎంసీ గ్రౌండ్ లో తలసాని యువసేన ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ను తలసాని ప్రారంభించారు. తరచుగా క్రీడాపోటీలలో పాల్గొనడం వలన బాడీ ఫిట్ నెస్ పెరుగుతుందని ఆయన అన్నారు. క్రీడలలో గెలుపు, ఓటములు సహజమని, ఓడిన వారు అధైర్య పడకుండా మరింత శ్రమించి క్రీడా పోటీలలో మరింత ప్రతిభను చాటాలని అన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ టోర్నమెంట్ లో 85 టీమ్ లు పాల్గొంటున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ తేరాస ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, అమీర్పేట తేరాస అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, వనం సంగీత, ఉమానాథ్ గౌడ్, కూతురు నర్సింహ, సుమిత్ సింగ్, బలరాం, నిర్వహకులు సచిన్, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు.



Next Story