నామా ఇంట్లో ముగిసిన సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

by  |
నామా ఇంట్లో ముగిసిన సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
X

దిశ, వెబ్‌డెస్క్ : టీఆర్ ఎస్ నేత ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్ రావు ఇంట్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.1064 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ఈడీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. నామా ఇంటితో పాటు కార్యాలయం, మరో నాలుగు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 17 గంటల పాటు సాగిన ఈ ఈడీ సోదాలు ముగిశాయి. ఖమ్మం, హైదరాబాద్‌లో మొత్తం ఆరు చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. నామ ఇంటి నుంచి కీలక డాక్యుమెంట్లు, నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఈ అధికారులు తెలిపారు. అలానే జూబ్లీహిల్స్‌లోని నామా నివాసంలో భారీగా నగదు గుర్తించినట్లు తెలుస్తుంది. నామా నాగేశ్వరరావు సమక్షంలో డబ్బు లెక్కింపు కొనసాగింది.

Next Story

Most Viewed