అతడి భార్యకు ఈడీ నోటీసులు

by  |
అతడి భార్యకు ఈడీ నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: యూపీలో గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే వ్యవహారం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వికాస్ దూబేను పోలీసులు హతమార్చినా.. అతడి ఆస్తుల పై ఆరా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే దూబే భార్య రిచాకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆమెతో పాటు మరో 10 మంది కీలక అనుచరులు, ఫైనార్షియర్ గా వ్యవహారించిన జయకాంత్ పై ఈడీ మనీలాండరింగ్ కేసులను నమోదు చేశారు. అయితే, రిచా పాత్ర పై తొలి నుంచి అనుమానం వ్యక్తి చేసిన అధికారులు మొత్తం ఆస్తుల వివరాల పై కూపీ లాగనున్నారు. ఇందులో భాగంగా.. లక్నోలోని ఈడీ కార్యాలయంలో అధికారులు ఆమెను విచారణ చేయనున్నట్టు తెలుస్తోంది.

Next Story