- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజురాబాద్ ఎన్నిక నేపథ్యంలో రాజకీయాలు రోజురోజుకు ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. శనివారం దళిత బంధుపై బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. దళిత బంధు హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతీ దళిత కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రతీ దళిత కుటుంబానికి కూడా దళిత బంధు వెంటనే అందించాలని అన్నారు.
10 లక్షల రూపాయలను దళితులు వారి నైపుణ్యానికి అనుగుణంగా ఖర్చు పెట్టుకొనే వెసులుబాటు కల్పించాలన్నారు. దళిత బంధు డబ్బులపై కలెక్టర్, బ్యాంక్ మేనేజర్ల అజమాయిషీ ఉండకూడదని వెల్లడించారు. దళిత బంధు అందరికీ అందించకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. దళిత బంధు అందరికీ అందించకుండా చాటలో తవుడు పోసి కొట్లాట పెట్టినట్టు చేస్తే నేనే(ఈటల రాజేందర్) దీక్షకు కూర్చుంటానని పేర్కొన్నారు.
Next Story