కమలాపూర్‌లో ఓటు వేసిన ఈటల ఫ్యామిలీ.. ఈవీఎం మొరాయింపు

by  |
కమలాపూర్‌లో ఓటు వేసిన ఈటల ఫ్యామిలీ.. ఈవీఎం మొరాయింపు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్‌లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది. కమలాపూర్ మండల కేంద్రంలోని బూత్ నెంబర్.262 పోలింగ్ కేంద్రంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, ఆయన భార్య ఈటల జమున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు కమలాపూర్‌ మండలంలోని ఉప్పల్‌లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్ బూత్ నెంబర్ 295లో ఈవీఎంలను అధికారులు పరిశీలించారు. దీంతో అక్కడ పోలింగ్ ప్రక్రియ కొంత ఆలస్యంగా ప్రారంభమైంది.


Next Story

Most Viewed