ప్రభుత్వానికి సవాల్.. హైకోర్టులో ఈటల భార్య పిటిషన్​

by  |
High Court, cm kcr
X

దిశ, తెలంగాణ బ్యూరో: భూ కబ్జా ఆరోపణల వ్యవహారంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్​ కుటుంబం హైకోర్టుకెక్కింది. ప్రభుత్వాన్ని సవాల్​ చేస్తూ మంగళవారం పిటిషన్​ దాఖలు చేసింది. ఈటల రాజేందర్​సతీమణి జమునా, కుమారుడు నితిన్​రెడ్డి పిటిషన్​ వేశారు. తమ భూముల్లో చట్ట విరుద్ధంగా సర్వే చేశారని, తమకు సంబంధించిన భూముల్లో సర్వే చేసి బోర్డులు పెట్టారని జమునా హేచరీస్​ తరుఫున కోర్టుకు విన్నవించారు. తమ భూముల్లో ప్రభుత్వ యంత్రాంగం జోక్యం చేసుకోకుండా చూడాలని, ఇప్పటికీ పోలీసుల బందోబస్తుతో భయపెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని, బలవంతంగా చర్యలు తీసుకోకుండా డీజీపీ, విజిలెన్స్​ విభాగం, మెదక్​ కలెక్టర్​ను ఆదేశించాలని పిటిషన్​లో కోరారు. ఈ భూములకు సంబంధించిన పలు ధృవీకరణ పత్రాలను సైతం కోర్టుకు దాఖలు చేశారు.

Next Story