సూర్యాపేట జిల్లాలో భూప్రకంపనలు

by Vadlamudi Anukaran |   (  Updated:2020-07-24 23:50:56  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: వాతావరణంలో మార్పు కారణమో లేదా మరే కారణమో తెలియదు కానీ, దేశంలో పలు చోట్ల గత కొద్ది రోజుల నుంచి వరుసగా భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. ప్రతిరోజూ ఏదో ఒక చోట భూమి కంపిస్తున్నది. అయితే తాజాగా సూర్యాపేట జిల్లాలో కూడా భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ఆ జిల్లా ప్రజలు ఆందోళనలో పడ్డారు. జిల్లాలోని మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల్లో భూమి కంపించింది. శుక్రవారం అర్థరాత్రి సమయంలో భారీ శబ్ధాలతో భూమి కంపించింది. దీంతో ఇళ్లలో [&hellip;]</p>

సూర్యాపేట జిల్లాలో భూప్రకంపనలు
X

దిశ, వెబ్ డెస్క్: వాతావరణంలో మార్పు కారణమో లేదా మరే కారణమో తెలియదు కానీ, దేశంలో పలు చోట్ల గత కొద్ది రోజుల నుంచి వరుసగా భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. ప్రతిరోజూ ఏదో ఒక చోట భూమి కంపిస్తున్నది. అయితే తాజాగా సూర్యాపేట జిల్లాలో కూడా భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ఆ జిల్లా ప్రజలు ఆందోళనలో పడ్డారు.

జిల్లాలోని మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల్లో భూమి కంపించింది. శుక్రవారం అర్థరాత్రి సమయంలో భారీ శబ్ధాలతో భూమి కంపించింది. దీంతో ఇళ్లలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. వారంతా కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Next Story