ఉత్తరాఖండ్‌లో భూకంపం.. భయాందోళనలో ప్రజలు

by  |
ఉత్తరాఖండ్‌లో భూకంపం.. భయాందోళనలో ప్రజలు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తరాఖండ్‌లో భారీ భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని జోషిమఠ్‌లో శనివారం ఉదయం భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మలజి స్పష్టం చేసింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.6 గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. జోషిమఠ్ కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిపల్ కోటి వద్ద భూకంప కేంద్రం ఉందని పేర్కొంది. భూకంప ప్రభావం కారణంగా జోషిమఠ్ లో భవనాలు స్వల్పంగా కంపించాయి.



Next Story