ఈ నెల 23 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్

by  |
ఈ నెల 23 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్
X

దిశ, వెబ్‎డెస్క్: ఈ నెల 23 నుంచి ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాంకేతిక విద్య విభాగం ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం. నాయక్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎంసెట్‎లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ కౌన్సెలింగ్‎లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఈ వెబ్ కౌన్సెలింగ్‎లో పాల్గొనేందుకు ఓసీ, బీసీ విద్యార్థులు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.600 చొప్పున ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వెబ్ ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపు తేదీలను తర్వాత ప్రకటించనున్నారు.

అక్టోబరు 23వ తేదీన ఆంగ్లో ఇండియన్, పీహెచ్‎వీ, పీహెచ్‎హెచ్, పీహెచ్ఓ కేటగిరీల్లో మొదటి నుంచి చివరి ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇక అదే రోజున ఎన్‎సీసీ కేటగిరీలో నుంచి 35,000 ర్యాంకు వరకు కౌన్సెలింగ్ ఉండనుంది. ఇక 24న సీఏపీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీలలో 1 నుంచి 45,000 వరకు, ఎన్‎సీసీ కేటగిరీలో 35,001 నుంచి 70,000 వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. 25న సీఏపీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీలలో 45,001 నుంచి 90,000 ర్యాంకు వరకు, ఎన్‎సీసీ కేటగిరీలో 70,001 నుంచి 1,05,000 వరకు కౌన్సెలింగ్ జరగనుంది. ఇక చివరి రోజు 26న సీఏపీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీలలో 90,001 నుంచి చివరి ర్యాంకు వరకు, ఎన్‎సీసీ కేటగిరీలో 1,05,001 నుంచి చివరి ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.



Next Story