మరుగుజ్జు మర్డర్.. అంతా మిస్టరీ!

by  |
మరుగుజ్జు మర్డర్.. అంతా మిస్టరీ!
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. వివాదరహిడైన ఓ మరుగుజ్జు వ్యక్తిని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. అతడి ఇంట్లోనే హతమర్చి.. మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టు చెరువులో పడేశారు. స్థానికులు, పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం పండ్లవెల్లి గ్రామానికి చెందిన కృష్ణ కూకట్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రకాష్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. మరుగుజ్జు అయిన కృష్ణ స్థానికంగా ట్యూషన్లు చెబుతుంటాడు. ఖాళీ సమయంలో పూల వ్యాపారం కూడా చేస్తుంటాడు. అందరితో సౌమ్యంగా ఉంటే అతడు హత్యకు గురయ్యాడు.

సోమవారం మధ్యాహ్నం కూకట్‌పల్లి నల్లచెరువులో ప్లాస్టిక్ కవర్లో స్థానికులు మృతదేహాన్ని గుర్తించారు. వారిచ్చిన సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కవర్ విప్పడంతో స్థానికులు మృతదేహం కృష్ణదిగా గుర్తించారు. వెంటనే పోలీసులు ప్రకాష్ నగర్ లోని హతుడి ఇంటికి చేరుకుని పరిశీలించగా.. ఇంటి ఎదుట రక్తపు మరకలు కనిపించాయి. కృష్ణను అతడి ఇంటి వద్దనే హత్య చేసి కవర్లో మూటకట్టి చెరువులో పారవేసారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే హతుడికి ఎవరితో గొడవలు లేవని, హత్య ఎవరు, ఎందుకు చేశారనేది తెలియటం లేదని మృతుడి తండ్రి ఆంజనేయులు తెలిపారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు హంతకుల కోసం గాలిస్తున్నారు.



Next Story

Most Viewed