- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, కరీంనగర్: కార్ల హారన్ల మోతలు, వీఐపీల కాన్వాయ్లతో కిక్కిరిసి పోయిన హుజూరాబాద్ ప్రశాంత వాతావరణానికి చేరుకుంది. నిరాటంకంగా సాగిన ప్రచార హోరుతో సందడి సందడిగా ఉన్న ఈ సెగ్మెంట్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. సద్దుల బతుకమ్మ, విజయ దశమి వేడుకల పుణ్యమా అని హుజూరాబాద్లో తాత్కాలిక బ్రేకు పడింది. ఉప ఎన్నికల కారణంగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారంతో దద్దరిల్లిపోతున్న ప్రజలకు కాస్తా ఉపశమనం దొరికినట్టయింది. ఆయా పార్టీల నాయకులు పండుగల కారణంగా తమ తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. దీంతో నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి తాత్కాలికంగా బ్రేకు పడినట్టయింది.
మిగిలింది అభ్యర్థులే
అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర బాధ్యులందరూ కూడా తమ ప్రాంతాలకు వెళ్లిపోగా ఒకరిద్దరు నాయకులు నియోజకవర్గంలో పర్యటించారు. బీజేపీ పార్టీకి చెందిన ఇన్చార్జీలు కూడా వెళ్లిపోయారు. కొంతమంది నాయకులు ప్రచారంలో పాల్గొన్నప్పటికీ అంతగా ప్రచార హోరు మాత్రం కనిపించలేదు. స్థానికంగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్లు మాత్రమే ఉండిపోయారని చెప్పాలి. కాంగ్రెస్ క్యాండెట్ బల్మూరి వెంకట్ గురువారం ప్రచారం నిర్వహించినప్పటికీ శుక్రవారం మాత్రం నియోజకవర్గంలో అందుబాటులో ఉండే అవకాశాలు లేనట్టు తెలుస్తోంది.