నిజామాబాద్ డీఈవోగా దుర్గాప్రసాద్..

by  |
నిజామాబాద్ డీఈవోగా దుర్గాప్రసాద్..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్:
నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారిగా దుర్గాప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు చిత్రరాంచంద్రన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ డీఈవోగా పని చేస్తున్న జనార్ధన్ రావును కరీంనగర్ జిల్లా విద్యాశాఖాధికారిగా.. అక్కడ పనిచేస్తున్న దుర్గాప్రసాద్‌ను నిజమాబాద్‌కు బదిలీ చేశారు. దుర్గాప్రసాద్ తొలిసారి నిజామాబాద్ జిల్లాలో విద్యాశాఖాధికారిగా గతేడాది జనార్ధన్ రావుకు ముందే పనిచేయడం విశేషం. కాగా, అకస్మికంగా దుర్గాప్రసాద్‌కు నిజామాబాద్ బదిలీ అవ్వడానికి గల కారణాలు తెలియరాలేదు.



Next Story

Most Viewed