పోలీసులకే షాకిచ్చిన ప్రభుత్వ ఉద్యోగి భార్య.. నిజం తెలిసి అవాక్కైన భర్త

by  |
Duplicate-Thieft1
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఓ దొంగనతం కేసు విషయంలో పోలీసులు అవాక్కయ్యారు. నిజం తెలవడంతో భర్త కూడా షాక్ కు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడేపల్లిలోని కుంచనపల్లిలోని ఓ భవనంలో ఉన్న ఫ్లాట్ లో ప్రభుత్వ ఉద్యోగి నివాసముంటున్నాడు. అయితే, అతను పని మీద ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆయన తిరిగి వచ్చేసరికి ఇంట్లో చెల్లాచెదురుగా వస్తువులు, బట్టలు పడి.. అంతా చిందవందరగా ఉంది. దీంతో ఆ వ్యక్తి తన ఇంట్లో దొంగతనం జరిగిందంటూ పోలీసులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అన్ని కోణాల్లో పరిశీలించారు. అయినా కూడా వారికి అక్కడ దొంగతనం జరిగినట్లు ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో అనుమానమొచ్చి ఆ ప్రభుత్వ ఉద్యోగి భార్యను విచారించారు. అదేవిధంగా క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలను సేకరించి పోల్చగా అవి ఆమెవేనని తేలడంతో పోలీసులు అవాక్కయ్యారు. అదంతా కూడా కట్టుకథ అని, ఆమెకు మతిస్థిమితం లేకపోవడంతో అతని భార్య ఈ విధంగా వ్యవహరించిందని పోలీసులు తెలిపినట్లు సమాచారం.

Next Story

Most Viewed