మెగాఫోన్ పట్టిన బృంద మాస్టర్

by  |
మెగాఫోన్ పట్టిన బృంద మాస్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: కొరియో గ్రాఫర్ బృంద మాస్టర్ దర్శకురాలిగా మారుతున్నారు. దుల్కర్ సల్మాన్ హీరోగా ‘హే సినామిక’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాజల్ అగర్వాల్, అదితి రావు హైదరీ ప్రధాన పాత్రల్లో కనిపిస్తుండగా.. జీ స్టూడియోస్ సినిమాను నిర్మిస్తుంది. గోవింద్ వసంత సంగీతం సమకూరుస్తున్నారు. కాగా సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన బృంద మాస్టర్ స్నేహితురాలు నటి ఖష్బూ క్లాప్ కొట్టి సినిమాను లాంచ్ చేశారు. దర్శకులు మణిరత్నం, సుహాసిని లాంచింగ్ ఈవెంట్‌కు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

‘హే సినామిక’ బృంద మాస్టర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలిపిన ఖుష్బు… తన కలను సాకారం చేసేందుకు సపోర్ట్ చేస్తున్న దుల్కర్ సల్మాన్, కాజల్, అదితి రావులకు సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. మీరు లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదన్న ఖుష్బు… మూవీ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాగా ఇప్పటికే ప్రభుదేవా, లారెన్స్ రాఘవ లాంటి కొరియోగ్రాఫర్లు .. దర్శకులుగా మారి రాణిస్తుండగా…. బృంద మాస్టర్ కూడా ఆ జాబితాలో చేరిపోయారు.

Tags: Brunda Master, Director, Hey Sinamika, Dream Project, Khushboo, Kajal Agarwal, Aditi Rao Hyderi



Next Story