నో స్టాక్​… కరోనా ఎఫెక్ట్​

by  |
నో స్టాక్​… కరోనా ఎఫెక్ట్​
X

దిశ, న్యూస్​ బ్యూరో: కరోనా వైరస్​ (కోవిడ్-19) దాదాపు అన్ని రంగాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుండగా..సూపర్ మార్కెట్లకు మాత్రం మంచి ఆదాయాన్నస్తోంది. కరోనా వ్యాప్తి చెందకుండా ఆదివారం బంద్​ ప్రకటించాలని ప్రధాని పిలుపునిచ్చిన నేపథ్యంలో..ప్రజలు ఇంటికి అవసరమైన అన్నివస్తువులను ఇప్పుడే కొనుగోలు చేస్తున్నారు.

పెరిగిన రీటైల్ వ్యాపారం..

కరోనా నివారణ చర్యల్లో భాగంగా పలు సంస్థలు వ్యాపార సముదాయాలను బంద్​ చేయాలని ఆదేశించినా.. నిత్యవసరాలు లభించే సూపర్​ మార్కెట్లను మినహాయించారు. అయితే ఈ మూడ్రోజుల వ్యవధిలో రీటైల్​ వ్యాపారం 2–4 రెట్లు పెరిగింది. గతంలో అవసరమైన మేరకే కొనుగోళ్లు జరిపే వారనీ, ఇప్పుడు వారానికంటే ఎక్కువ కాలానికి అవసరమైన వస్తువులను కస్టమర్లు తీసుకెళ్తున్నారని సూపర్​ బజార్ల నిర్వాహకులు చెబుతున్నారు. టిఫిన్స్​ కోసం అవసరమైన పిండి, పిల్లలకు స్నాక్స్​, బిస్కెట్లు, చాక్లెట్లు, పప్పులు వంటివి ఎక్కువగా కొనుగోళ్లు చేస్తున్నారు. ఆదివారం సూపర్​ మార్కెట్లు కూడా మూత పడుతుండటంతో ముందుగానే పాలు, పెరుగు, కూరగాయలు, ఆకుకూరలు, ఆహార ఉత్పత్తుల అమ్మకాలు పెరిగిపోయాయి. నగరంలో బిగ్​ బజార్​, హెరిటేజ్​, రిలయన్స్​, స్పెన్సర్​, మోర్​, డీ– మార్ట్​, రత్నదీప్​, తరుణి మాల్స్​ రీటైల్​ రంగంలో పనిచేస్తున్నాయి. అన్ని కలిపి సుమారు 600 వరకూ ఉన్నాయి. సాధారణ రోజుల్లో రూ.50 వేలు బిజినెస్​ చేసే తమ బ్రాంచ్​లో శుక్ర, శనివారాల్లో ఒక్కో రోజు రూ.3 లక్షలపైగా వరకూ అమ్మకాలు జరిగాయని ఓ ప్రైవేటు రీటైల్​ బ్రాంచ్​ మేనేజర్​ వివరిస్తున్నారు. ఇప్పటికే తమ వద్ద ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ వంటివి పూర్తిగా అయిపోయాయని ఆయన తెలిపారు. చాలా రీటైల్​ బజార్లలో పిండి, పప్పుల నిల్వలు లేకుండా పోయినట్టు తెలుస్తోంది.

Tags : retail market, no stock, dmart, ratnadeep


Next Story

Most Viewed