రేపు ఉదయానికి దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి ఫైనల్

by  |
రేపు ఉదయానికి దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి ఫైనల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయం వరకు దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిని ఫైనల్ చేస్తామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దుబ్బాక బై పోల్ బరిలో మాణిక్కం ఠాగూర్‌ వ్యూహాలతో ముందు కెళ్తామని పేర్కొన్నారు. నాతో పాటు ప్రతీ కార్యకర్తకు ఉప ఎన్నిక బాధ్యతలు ఉంటాయని, ఈనెల 8లోపు ఎవరికి అప్పగించిన గ్రామాల్లో వారు ఉండాలని తెలిపారు. పట్టాభద్రుల ఎమ్మెల్సీ, జీహెచ్ఎంసీ ఎన్నికలపై దృష్టి సారించామని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌ హథ్రస్ జిల్లాలో జరిగిన ఘటనకు నిరసనగా రేపు సాయంత్రం 4గంటలకు దేశ, రాష్ట్ర రాజధానుల్లో సత్యాగ్రహ కార్యక్రమం చేపడుతామని వెల్లడించారు.

Next Story