దుబ్బాక బీజేపీ అభ్యర్థి ఖరారు

by  |
దుబ్బాక బీజేపీ అభ్యర్థి ఖరారు
X

దిశ, తెలంగాణ బ్యూరో: దుబ్బాక ఉపఎన్నిక బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు పేరును కేంద్ర కమిటీ ఖరారు చేసింది. దేశంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఢిల్లీ నుంచి మంగళవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. అందులో తెలంగాణలో దుబ్బాక నుంచి పోటీకి రఘునందన్‌రావును నిలుపుతున్నట్లు పార్టీ స్పష్టం చేసింది. మూడునెలల క్రితం దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యం కాగా.. మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాతకు టీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించగా కాంగ్రెస్ పార్టీ శ్రీనివాస్‌రెడ్డికి టికెట్ ఇచ్చింది. నవంబర్ 3న ఉపఎన్నికకు పోలింగ్ జరగనుండగా నవంబర్ 10న ఫలితం వెలువడనుంది.

Next Story

Most Viewed