- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబె డెస్క్: సీనియర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత రామలింగారెడ్డి కన్నుమూసిన సంగతి తెలిసిందే. దుబ్బాక నియోజకవర్గానికి చెందిన ఆయన.. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు కూడా. ఆయన మృతి పట్ల సీఎం కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు, ఇతర పార్టీల నేతలు కూడా నివాళులర్పించారు.
ఈ నేపథ్యంలోనే రామలింగారెడ్డికి సంతాపం ప్రకటించిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. ఉపఎన్నికలో ఆయన భార్యకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా చేస్తేనే రామలింగారెడ్డికి నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందన్నారు. ఆయన భార్యకు టికెట్ ఇస్తే.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో తాను మాట్లాడుతానని జగ్గారెడ్డి తెలిపారు. అంతేకాకుండా దామోదర్ రాజనర్సింహ, గీతారెడ్డితో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేస్తానని కూడా వివరించారు.