కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతా

by  |
కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతా
X

దిశ, దుబ్బాక: కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, అన్ని రకాల పత్తిని కొనుగోలు చేయడానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే మాధవనేని రఘునందనరావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా తొగుట మండలం మెట్టు గ్రామం వద్ద వెంకటేశ్వర కాటన్ ఇండస్ట్రీ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం కల్పించిన విధంగా మూడు రకాల పత్తి అంటే తేమ శాతం 28,29,30 ఉన్న పత్తిని కొనుగోలు చేయడం జరుగుతుందని, ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల పత్తి రంగు మారిన విషయం వాస్తవమేనని, ఆ నాలుగవ రకం పత్తిని కూడా కొనుగోలు చేసేందుకు తాను ప్రభుత్వంతో మాట్లాడుతానన్నారు. రైతులెవరూ అధైర్య పడొద్దని ప్రతిగింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు.

Next Story

Most Viewed