ఆ పంటను సాగు చేశారు.. అరెస్ట్ అయ్యారు

by  |
ఆ పంటను సాగు చేశారు.. అరెస్ట్ అయ్యారు
X

దిశ,వెబ్ డెస్క్ : చిత్తూరు జిల్లా మదన పల్లెలో డ్రగ్స్ మాఫియా గుట్టురట్టు అయింది. దేశంలో డ్రగ్స్ తయారు చేసే గసగసాల పంట నిషేధం అయితే డ్రగ్స్ తయారి కోసం గసగసాలు పంటను సాగుచేస్తున్న మాఫియాను పోలీసులు పట్టుకున్నారు. మార్ఫిన్ ,హెరాయిన్ , బ్రౌన్ షుగర్ తయారీకి వినియోగించే గసగసాల పంటను ఎస్ఈబీ అధికారులు ధ్వంసం చేశారు. గసగసాల కాయల నుంచి వచ్చే జిగురు, పాల నుంచి డ్రగ్స్ తయారీ చేస్తున్నట్టుగా తెలిపారు. టమోటా, అల్లనేరేడు పంటల చాటున గసగసాల పంటను సాగుచేస్తున్నారని ఎన్ఈబీ పెర్కొంది. రైతులకు డబ్బు ఆశ చూపించి పొలాల్లో ఈ గసగసాల పంట సాగుచేస్తున్నట్టుగా వారు తెలిపారు. ఇంకా జిల్లాలో ఎక్కడెక్కడ పంట సాగు చేస్తున్నారనే దాని పై ఎస్ఈబీ ఆరా తీస్తుంది.


Next Story

Most Viewed