మొరం కొడుతుండగా ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి

by  |
మొరం కొడుతుండగా ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
X

దిశ, హుజురాబాద్ : ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా కొట్టడంతో డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన శనివారం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం జాగీరీపల్లి గ్రామంలో వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. ట్రాక్టర్‌తో మొరం కొడుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ఇంజిన్ బోల్తా పడి అకునురు గ్రామానికి చెందిన డ్రైవర్ జెల్ల ప్రవీణ్ (25) తీవ్ర గాయాల పాలయ్యాడు.

వెంటనే అతన్ని హుజురాబాద్ ప్రభుత్వ హాస్పటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story

Most Viewed