దారుణం : క్రషర్ మెషిన్‌లో పడి వ్యక్తి మృతి

by  |
దారుణం : క్రషర్ మెషిన్‌లో పడి వ్యక్తి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : మేడ్చల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రావల్ కోల్ పంచాయతీలో గల విజయలక్ష్మి క్రషర్ మెషిన్‌లో ప్రమాదవశాత్తు పడి డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. అయితే, క్రషర్ మెషిన్ వ్యక్తి పడిపోయాక అతని మీద పెద్ద పెద్ద బండరాళ్లు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతదేహం గుర్తుపట్టలేని స్థిలిలో ఉన్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అక్కడి వర్కర్స్ అందించిన వివరాల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ ఘటనతో పాటు మృతుడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed