పెళ్లింట్లో తీవ్ర విషాదం.. కొత్త బట్టల కోసమని వెళ్లి విగతజీవులుగా మారి..!

by  |
పెళ్లింట్లో తీవ్ర విషాదం.. కొత్త బట్టల కోసమని వెళ్లి విగతజీవులుగా మారి..!
X

దిశ, కోరుట్ల : కొద్దిరోజల్లో పెళ్లి జరగాల్సిన ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కాసేపట్లో ఇంటికి చేరాల్సిన ఆ కుటుంబాన్ని విధి విగత జీవులుగా మార్చింది. పెళ్లి సందడి నెలకొనాల్సిన ఇంట్లో ఆర్త నాదాలు హోరెత్తాయి. వివాహ వేడుక కోసం కొత్త బట్టలు తీసుకు వచ్చేందుకు వెళ్లిన ఫ్యామిలీలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో తీవ్ర విషాదం నింపింది.

వివరాల్లోకివెళితే.. కోరుట్ల పట్టణంలోని బిలాల్ పురకు చెందిన జావిద్ సులేమాన్ తన భార్య సుమయా తమ్ముడు ఎండీ పూర్ ఖాన్ వివాహం ఈ నెల 29న జరగాల్సి ఉంది. అయితే, పెళ్లి కోసం కొత్త బట్టలు కొనేందుకు జావిద్ తన భార్య సుమయా, ముగ్గురు పిల్లలు కలిసి డ్రైవర్ సాజిద్‌ కారులో గత మూడు రోజుల కిందట హైదరాబాద్‌కు వెళ్లారు. షాపింగ్ అనంతరం ఆదివారం అదే కారులో కోరుట్లకు తిరిగి వస్తుండగా ఆర్టీసీ బస్సు కారు ఎదురెదురుగా ఢీ కొన్న ఘటనలో జావిద్ సులేమాన్ కుమారులు అజాన్, ఎండీ ఆషార్‌లతో పాటు డ్రైవర్ సాజిద్ అలీలు మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న మిగతా వారు కూడా గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంతో వివాహం జరగాల్సిన ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది.

Next Story