- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అన్నపురెడ్డిపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో డీఆర్డీఓ పీడీ మధుసూదనరావు పర్యటించారు. బుధవారం మైబునగర్ని బృహత్ పల్లెప్రకృతి వనాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మొక్కల పెంపకానికి తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వనంలో పనిచేస్తున్న కూలీల మాస్టర్ను డీఆర్డీఓ పీడీ పరిశీలించారు. మొక్కల పెంపకానికి నీటి కొరత ఉన్నట్లు కూలీలు తెలపడంతో త్వరలోనే బోరు మంజూరు చేస్తామని, డ్రిప్పు గ్రామ పంచాయతీ సమకూరుస్తుందని, కలుపు మొక్కలు పెరగకుండా చూసుకోవాలని సూచించారు. అనంతరం గుంపెన పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రేవతి, ఏపీఓ ప్రమీల, ఈసీ ప్రసాదరావు, టీఏ లు నాగజ్యోతి, శ్రీను పాల్గొన్నారు.
Next Story