సెల్లార్‌ నీటిని తొలగిస్తుండగా కరెంట్ షాక్

by  |
సెల్లార్‌ నీటిని తొలగిస్తుండగా కరెంట్ షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో కురిసిన అతి భారీ వర్షం తీవ్ర విషాదాన్ని నింపింది. మంగళవారం రాత్రి నగరంలో పలుచోట్ల పాతగోడలు కూలి ఇప్పటికే 10మంది చనిపోగా బుధవారం మధ్యాహ్నం బంజారాహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో నీటిని తోడేందుకు విద్యుత్‌ మోటార్ ఆన్ చేసిన డాక్టర్ సతీశ్‌రెడ్డి షాక్‌కు గురై కుప్పకూలాడు. వెంటనే అపార్ట్‌మెంట్ వాసులు ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే చనిపోయాడు. శ్రీనగర్ కాలనీ ఎస్‌బీహెచ్‌కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఘటన జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.


Next Story

Most Viewed