ఎన్​హెచ్​ఆర్​సీకి డాక్టర్​ గంగాధర్ ​కేసు

by  |
ఎన్​హెచ్​ఆర్​సీకి డాక్టర్​ గంగాధర్ ​కేసు
X

దిశ, ఏపీ బ్యూరో: కాంగ్రెస్‌ నేత డాక్టర్ గంగాధర్ కేసును ఎన్‌హెచ్‌ఆర్సీ స్వీకరించింది. కేసు నమోదు చేసినట్టు డాక్టర్ గంగాధర్‌కు ఎన్‌హెచ్‌ఆర్సీ సమాచారం ఇచ్చింది. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్లు ఇబ్బందిపడుతున్నారని, ఓ ఛానల్‌ చర్చలో అన్నందుకు గంగాధర్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహరంపై ఎన్‌హెచ్‌ఆర్సీ, హైకోర్టు సీజేకు పీసీసీ చీఫ్‌ శైలజానాథ్ లేఖరాశారు. భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కల్గించే విధంగా వ్యవహరిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు ఇవ్వాలంటూ శైలజానాధ్ వద్దకు లీగల్ సర్వీస్ అథారిటీ ప్రతినిధిని హైకోర్టు పంపింది.

Read Also…

మరో వివాదంలో వైసీపీ ఎమ్మెల్యే..!



Next Story

Most Viewed