ఢిల్లీలో రూల్స్ బ్రేక్….. రూ.20లక్షలు ఫైన్ !

by  |
ఢిల్లీలో రూల్స్ బ్రేక్….. రూ.20లక్షలు ఫైన్ !
X

దిశ, వెబ్‌డెస్క్: పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించడంతో ఫెడరేషన్‌ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్‌ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్ఐసీసీఐ-ఫిక్కీ)కి ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ (డీపీసీసీ) రూ.20లక్షల జరిమానా విధించింది. మొత్తాన్ని రూ.15రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. ఇదేక్రమంలో యాంటీ- స్మాగ్‌ గన్‌లు ఉపయోగించకుండా ఎలాంటి కూల్చివేత పనులను కొనసాగించడం గానీ, పున ప్రారంభించడం గానీ చేయొద్దని స్పష్టం చేసింది. అయితే డీపీసీసీ సూచనను లెక్క చేయని ఫిక్కీ… ఢిల్లీలోని తాన్‌సేన్ మార్గ్‌లో తన ప్రాజెక్టులో కూల్చివేతలు చేపట్టింది.

Next Story