శోభనం గదిలో వధువుకు షాకిచ్చిన భర్త.. అత్తా, ఆడపడుచుతో కలిసి ఆ రాత్రి..

by  |
dowry harrasment
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నో ఆశలతో ఆమె పెళ్లి చేసుకుంది. అత్తవారింట్లో కోటి ఆశలతో అడుగుపెట్టింది. భర్తతో హాయిగా జీవించాలనుకొని గంపెడు కోరికలతో శోభనం గదిలో అడుగుపెట్టింది. కానీ, కళ్లలో పెట్టి చూసుకోవాల్సిన భర్త ఆమెకు కన్యత్వ పరీక్ష చేయించాడు. అతనికి తల్లి, ఆడపడుచు వంత పాడారు. ఇలాగే పెళ్ళైన దగ్గరనుంచి ఆమెకు ఎన్నో అవమానాలు, అనుమానాలు.. అన్ని భరించుకుంటూనే వచ్చింది. ఆమె మౌనంగా ఉండడంతో భర్త ఇంకా రెచ్చిపోయాడు. దీంతో భర్త ఆగడాలను సహించలేని ఆమె పోలీసులను ఆశ్రయించిన ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగుచూసింది.

వివరాలలోకి వెళితే.. గ్వాలియర్‌లోని దబ్రా ప్రాంతానికి చెందిన రాణి, అదే ప్రాంతానికి చెందిన హిమాన్షును గతేడాది మార్చిలో వివాహం చేసుకుంది. శోభనం గదిలోకి వెళ్లిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె కన్యా.. కాదా అని తెలుసుకోవడానికి భర్త, ఆమెకు కన్యత్వ పరీక్షలు చేయించాడు. అందుకు అత్త, ఆడపడుచు సహాయం చేశారు. ఇక పెళ్ళైన కొద్దీ రోజుల తర్వాత కట్నం కోసం వేధింపులు మొదలుపెట్టారు. నల్లగా ఉన్నా సరే కోడలిగా చేసుకున్నామని, 20 లక్షల రూపాయల కట్నం తీసుకురావాలని వేధించడం మొదలుపెట్టారు. ఇంత వేధించినా రాణి తల్లిదండ్రులకు ఒక్క మాట కూడా చెప్పకుండా అత్తవారింట్లోనే ఉండసాగింది.

ఇక కొన్ని రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిన రాణి ఇటీవల అత్తవారింటికి రాగా ఇంటికి తాళం వేసి ఉండడం చూసి షాక్ అయ్యింది. భర్తకు ఫోన్ చేసి అడగగా 20 లక్షల రూపాయల కట్నం తెస్తేనే లోపలి రావాలని, లేకపోతే బయటే ఉండమని చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో రాణి పుట్టింటికి చేరుకొంది. అనంతరం తండ్రితో పాటు పోలీస్ స్టేషన్ కి వెళ్లి భర్తపై ఫిర్యాదు చేసింది. రాణి ఫిర్యాదు మేరకు భర్త హిమాన్షును పోలీసులు అరెస్ట్ చేశారు.

Next Story

Most Viewed